జాతీయ వార్తలు
నలుగురు పోలీసులను కాల్చిచంపిన మిలిటెంట్లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
శ్రీనగర్, డిసెంబర్ 11: దక్షిణ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో నలుగురు పోలీసులను మిలిటెంట్లు కాల్చి చంపారు. ఆరు కాశ్మీరీ పండిట్ల కుటుంబాలున్న ప్రాంతంలో చిన్న ఔట్పోస్టులో కాపలాగా ఉన్న నలుగురు పోలీసులపైకి ఆరుగురు లష్కరే తోయిబా మిలిటెంట్లు విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరో పోలీసును చికిత్సకు తరలించగా ఆర్మీ ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. కాల్పుల అనంతరం మిలిటెంట్లు పోలీసులు ఉపయోగిస్తున్న ఆయుధాలను ఎత్తుకుపోయారు. మృతిచెందిన పోలీసులను అనీస్ అహ్మద్, హమీదుల్లా, మెహరాజుద్దీన్, అబ్దుల్ మజీద్గా గుర్తించారు. మిలిటెంట్లు కాల్పులు జరిపిన సమయంలో అక్కడ ఒక్క కాశ్మీరీ పండిట్ కుటుంబం మాత్రమే నివసిస్తున్నట్లు తెలుస్తోంది. వెంటనే ఆ ప్రాంతానికి అదనపు బలగాలను పంపి మిలిటెంట్ల కోసం గాలింపు ముమ్మరం చేశారు.