జాతీయ వార్తలు
దర్యాప్తు పూర్తయ్యే వరకు రాకండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 26 July 2016
న్యూఢిల్లీ, జూలై 25: పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్ను వీడియో తీసిన సంఘటనపై జరుగుతున్న దర్యాప్తు పూర్తయ్యేవరకు లోక్సభకు హాజరుకావద్దని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మాన్ను లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆదేశించారు. అయితే త్వరలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్లమెంటులో తన గళాన్ని నొక్కేసేందుకే బిజెపి, కాంగ్రెస్, అకాలీదళ్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని మాన్ ఆరోపించారు. స్పీకర్ ఆదేశాల మేరకు ఏర్పడిన తొమ్మిది మంది సభ్యుల దర్యాప్తు ప్యానల్ వచ్చే నెల 3వ తేదీలోగా తన నివేదికను అందించాల్సి వుంది. అలాగే మాన్ కూడా మంగళవారం ఉదయం లోగా జరిగిన ఘటనకు సంబంధించి ఈ ప్యానెల్కు సంజాయిషీ ఇచ్చుకోవాలి.