జాతీయ వార్తలు

కమలనాథ్ ప్రమాణ స్వీకారానికి రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, డిసెంబర్ 15: ఈనెల 17న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమలనాథ్ చేసే ప్రమాణ స్వీకారోత్సవానికి అన్ని రాజకీయ పార్టీల వారు రావాలని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పలుకుతోంది. తొలుత ప్రకటించిన విధంగా లాల్ పరేడ్ గ్రౌండ్‌లో కాకుండా బిహెచ్‌ఇఎల్ ప్రాంతంలోని జాంబోరీ మైదాన్‌లో పీసీసీ అధ్యక్షుడు, తొమ్మిది సార్లు ఎంపీగా పనిచేసిన కమలనాథ్ ప్రమాణ స్వీకారం చేస్తారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందని, తొలుత నిర్ణయించిన వేదిక ఆహూతులకు సరిపడదని భావించినందున దానిని లాల్‌పరేడ్ గ్రౌండ్‌లోకి మార్చినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే కమలనాథ్ ఒక్కరే ఆరోజు ప్రమాణ స్వీకారం చేస్తారని, మంత్రులు త్వరలో ప్రమాణం చేస్తారని కాంగ్రెస్ తెలిపింది. 15 సంవత్సరాల తర్వాత అధికారం చేపట్టిన కాంగ్రెస్ నిర్వహించే ఈ ప్రమాణస్వీకారానికి యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తదితరులు విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, సమాజ్‌వాది అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌లతో పాటు మిగతా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ముఖ్యనేతలను ఆహ్వానించినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.