జాతీయ వార్తలు

నేడు కొలువుతీరనున్న కొత్త ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్, డిసెంబర్ 16: గత మూడు రోజులుగా చత్తీస్‌గఢ్ విషయంలో నిర్ణయాన్ని జాప్యం చేస్తూ వచ్చిన కాంగ్రెస్ అధినాయకత్వం ఆదివారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా సీనియర్ కాంగ్రెస్ నేత భూపేష్ బాగేల్ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పలువురు రాష్ట్ర నేతలు, ఎఐసీసీ నేతలతో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పరిశీలకుడు మల్లికార్జున్ ఖర్గే రాయ్‌పూర్‌కువెళ్లి పలువురు ఎమ్మెల్యేలతో మాట్లాడి వారి అభిప్రాయాన్ని సేకరించి పార్టీ హైకమాండ్‌కు నివేదించారు. 17వ తేదీ సోమవారం రాయ్‌పూర్‌లో రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రిగా భూపేష్ బాగేల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ వివరాలను ఖర్గే విలేఖర్లకు చెప్పారు. ప్రస్తుతానికి బాగేల్ ఒకరే ప్రమాణస్వీకారం చేస్తారు.
57 ఏళ్ల ఓబీసీ నేత భూపేష్ పార్టీ విజయానికి విశేష కృషి చేశారు. ముఖ్యమంత్రి పదవికి టీఎస్ సింగ్ దేవ్, తమ్రధ్వజ్ సాహు, చరణ్‌దాస్ మహంత్ పోటీపడ్డారు. రాష్ట్రంలో సీఎం పోస్టుకు పోటీపడుతున్న నలుగురు నేతలు గట్టివారని, సమర్థులని, ఈ పదవికి ఎవరిని ఎంపిక చేయాలో సంక్లిష్ట పరిస్థితి తలెత్తిందని ఖర్గే చెప్పారు. ఈ నలుగురి నేతలతో గత రెండు మూడు రోజులుగా రాహుల్ గాంధీ సంప్రదింపులు జరిపారు.
అనంతరం ఆదివారం రాయ్‌పూర్‌లో సీఎల్‌పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భూపేష్‌ను ఎమ్మెల్యేలు సీఎల్‌పీ నేతగా ఎన్నుకున్నారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినందువల్ల అనేక సవాళ్లు తమ ముందున్నాయని ఖర్గే చెప్పారు. కాగా కొలువుతీరనున్న కొత్త ప్రభుత్వం పారదర్శకత, జవాబుదారీతనం, బాధ్యతతో వ్యవహరిస్తుందని రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు.