జాతీయ వార్తలు

పొత్తులపై ఇప్పుడే చెప్పలేం: కమల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 16: రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తామా లేక ఇతర పార్టీలతో పొత్తులుంటాయా అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని మక్కల్ నీతి మయ్యమ్ పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీనటుడు కమల్ హసన్ ఆదివారం పేర్కొన్నారు. పార్టీని పటిష్టపరిచేందుకు కమల్ తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 20 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తారా లేక ఇతర పార్టీలతో పొత్తు ఉంటుందా అని విలేఖరులు ప్రశ్నించగా, దీనిపై అప్పుడే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రజలకు ఏది మేలు చేకూరుస్తుందో అలాంటి నిర్ణయమే తీసుకుంటానని కమల్ వెల్లడించారు. నవంబర్‌లో తుపాను వల్ల దెబ్బతిన్న గాజా ప్రాంతాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో కమల్ విలేఖరులతో మాట్లాడారు. అన్నా డీఎంకేకు చెందిన 18 మంది రెబెల్ ఎమ్మెల్యేను అనర్హులుగా ప్రకటించడంతోపాటు మరో రెండు స్థానాలు (ఎం కరుణానిధి - తిరువరూర్), (ఏకే బోస్ - తిరుపరన్‌కుండ్రమ్) ఖాళీ ఏర్పడ్డాయి. ఈ స్థానాలకు కూడా త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి.