జాతీయ వార్తలు

ఆర్థిక సంస్కరణలతో ఆశించిన ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణ విధానాలు అనుకున్న ఫలితాలు ఇస్తున్నాయని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ముఖ్యంగా వస్తు సేవలణ పన్ను (జీఎస్టీ), నల్లధన నిరోధంపై చట్టం, దివాలాకోడ్ వంటివి ఉద్దేశిత ఫలితాలను అందిస్తున్నాయని, వీటన్నింటి ఉమ్మడి ఫలితంగా భారత్ ఉజ్వల భవితం సంతరించుకోబోతున్నదని వెంకయ్యనాయుడు తెలిపారు. దేశవ్యాప్తంగా గణనీయమైన సంఖ్యలో ప్రజలు బ్యాంకింగ్ పరిధిలోకి రావడం వల్ల పన్ను రేటు కూడా తగ్గే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఆదివారం నాడిక్కడ నీతిఆయోగ్ ఆధ్వర్యంలో జరిగిన మహిళా పరివర్తన భారత అవార్డులు-2018 ప్రదాన కార్యక్రమంలో మాట్లాడిన వెంకయ్యనాయుడు పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని గట్టిగా సమర్థించారు. ఏ లక్ష్యంతో అయితే 500, వెయ్యి రూపాయల నోట్లను మోదీ రద్దు చేశారో అది నెరవేరిందని, అంతకుముందు వరకు గోప్యంగా ఉన్న నల్లధనం అంతా బయటకు వచ్చిందని తెలిపారు. మొత్తం నగదును బ్యాంకింగ్ రంగంలోకి తీసుకురావడమే పెద్దనోట్ల రద్దు ఉద్దేశమని, దాదాపుగా ఆ లక్ష్యం నెరవేరినట్టేనని చెప్పడానికి గణనీయ పరిణామంలో నల్లధనం వెనక్కి రావడమే నిదర్శనమన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా భారత్‌లో అమలవుతున్న పన్నుల సంస్కరణల విధానాల పట్ల విదేశీ ఇనె్వస్టర్లు కూడా ఎంతగానో ఆకర్షితురవుతున్నారని వెంకయ్యనాయుడు తెలిపారు. అన్నిదేశాల ఆర్థిక వ్యవస్థలు ఆర్థిక మాంద్యంలో చిక్కుకున్న తరుణంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగం పెరగడం ఆర్థిక సంస్కరణల ఫలితమేనని ఆయన చెప్పారు. అయితే పెద్దనోట్ల రద్దు తర్వాత ఎంతమొత్తం బ్యాంకింగ్ రంగంలోకి తిరిగి వచ్చింది, ఎంతమొత్తం ఇంకా గోప్యంగా ఉందన్నది ఆర్‌బిఐ, ఆదాయపు పన్ను విభాగం వెల్లడించాల్సిన అంశాలని ఆయన అన్నారు. భారత అభివృద్ధికి సంబంధించి సరికొత్త పథాన్ని నిర్దేశించే సమాన అవకాశాలు దేశ యువతీయువకులకు లభిస్తున్నాయని, అలాంటి నవభారతం అతిత్వరలోనే ఆవిష్కృతం కానుందని ఆయన తెలిపారు.
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అంకుర పరిశ్రమలు భారత్‌లోనే ఆవిష్కృతమవుతున్నాయని పేర్కొన్న ఆయన ఈ విషయంలో మహిళలకు సరైన అవకాశాలు కల్పిస్తే పురుషులకంటే కూడా మెరుగైన ఫలితాలను సాధించగలుగుతారని అన్నారు. భారతదేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో మహిళల భాగస్వామ్యం 17 శాతం ఉంటే చైనాలో ఇది 41 శాతం ఉందని తెలిపారు. ఇందుకు కారణం అనేక రంగాల్లో మహిళా పారిశ్రామికవేత్తలు పురుషుల కంటే కూడా ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురు కావడమేనని ఆయన పేర్కొన్నారు. సమాజంలోని మహిళలందరికీ విద్యావిధానాన్ని అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించిన ఆయన చట్టసభల్లో వీరికి రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా బిల్లును గట్టెక్కించాలని, ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు చేయూతను ఇవ్వాలని వెంకయ్యనాయుడు కోరారు.
చిత్రం..నీతిఆయోగ్ ఆధ్వర్యంలో జరిగిన మహిళా పరివర్తన
భారత అవార్డులు-2018 ప్రదాన కార్యక్రమంలో మాట్లాడుతున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు