జాతీయ వార్తలు

మావి పారదర్శక ఒప్పందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌బరేలి (యూపీ): తమ ప్రభుత్వం పారదర్శకంగా చేపట్టే రక్షణ ఒప్పందాలపై కాంగ్రెస్ లేనిపోని ఆరోపణలతో నోరుపారేసుకుంటందని, తమ పార్టీలో ఖత్రోచి అంకుల్స్, క్రిస్టియన్ మిచెల్స్ మామలు లేకపోయినా అర్థం లేని నిరసనలు చేపడుతూ అసత్యాలు ప్రచారం చేస్తోందని యూపీఏ అధ్యక్షురాలు సోనియాపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. పైగా ఆ పార్టీ న్యాయవ్యవస్థపై లేనిపోని అనుమానాలు సృష్టిస్తోందన్నారు. రఫెల్ ఒప్పందంపై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన అనంతరం ప్రధాని మోదీ బహిరంగంగా ఈ విషయంపై మాట్లాడటం ఇదే తొలిసారి. అంతేకాక ఇటీవల మూడు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన అనంతరం బీజేపీ సోనియాగాంధీ నియోజకవర్గంలో తొలిసారిగా చేపట్టిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ భారత రక్షణ దళాలు పటిష్టంగా ఉండటం కాంగ్రెస్‌కు ఎంతమాత్రం ఇష్టం లేదని అన్నారు. దేశానికి ముఖ్యంగా రెండు అవసరాలున్నాయని, రక్షణ దళాలను సాధ్యమైనంత వరకు పటిష్టంగా తయారు చేయడం, రెండు ఎట్టి పరిస్థితుల్లో ఆ దళాల ద్వారా భారత్ బలహీనం కాకుండా చూడటం అని మోదీ పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ వైఖరి చూస్తే రక్షణ దళాలు పటిష్టంగా తయారు కావడం ఇష్టం లేనట్టు అన్పిస్తోందని, ప్రజలు కూడా ఈ విషయాన్ని చూస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా రామచరిత మానస్‌లోని కొన్ని వ్యాఖ్యలను మోదీ ఈ సందర్భంగా ఉదహరించారు. దాని ప్రకారం ‘సమాజంలో కొందరు వింత మనుషులుంటారు.. వారు నిత్యం అబద్ధాలే వింటారు. ఇతరులకు అబద్ధాలే ప్రచారం చేస్తారు’ అది కాంగ్రెస్‌కు అన్వయిస్తుందని, వారి ఉద్దేశంలో కూడా రక్షణ శాఖ మంత్రి, రక్షణ శాఖ, భారత వైమానిక దళం అధికారులు, ఫ్రాన్స్ ప్రభుత్వం వీరు చెప్పేవన్నీ అబద్ధాలేనని వారు పేర్కొన్నారని, ఇప్పుడు వారికి సుప్రీం కోర్టు కూడా అసత్యంగా కన్పిస్తోందని మోదీ విమర్శించారు.
రక్షణ ఒప్పందాల్లో అక్రమాలకు పాల్పడటం కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని, ఖత్రోచి మామతో వారికే సంబంధం ఉందని మోదీ విమర్శించారు. 1986లో రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు జరిగిన బోఫోర్సు ఒప్పందంలో ఇటలీకి చెందిన వ్యాపారవేత్త ఖత్రోచి మధ్యవర్తిగా వ్యవహరించారని, ఈ సందర్భంగా కోట్లరూపాయలు చేతులు మారిన విషయం తెలిసిందేనని అన్నారు. అలాగే అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ కేసులో కూడా అనేక అక్రమాలు జరగడంతో మధ్యవర్తిగా వ్యవహరించిన క్రిస్టియన్ మిచెల్‌ను భారత్ రప్పించామని ప్రధాని తెలిపారు.
ఈ విషయంలో మిచెల్ తరఫున వాదించడానికి కాంగ్రెస్‌కు చెందిన లాయర్ వెళ్లడం అందరూ చూశారన్నారు. అలాంటి కాంగ్రెస్ పదేపదే తమ ప్రభుత్వ రక్షణ ఒప్పందాలపై ఎందుకు అసత్య ఆరోపణలు చేస్తోందని ఆయన ప్రశ్నించారు. ఎందుకంటే మేము చేసిన రక్షణ ఒప్పందాల్లో ఖత్రోచి మామ కాని, క్రిస్టియన్ మిచెల్ కాని లేరు.. అందుకే ఆ పార్టీ పదేపదే అబద్ధాలను ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు ఆ పార్టీ న్యాయవ్యవస్థను సైతం వదలడం లేదని, దానిపై కూడా సంశయాలను లేవనెత్తుతోందని మోదీ ఆరోపించారు. కార్గిల్ సంఘటన తర్వాత అధునాతన విమానాలను సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావించిందని చెప్పారు. పది సంవత్సరాల పాటు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం వైమానిక దళం పటిష్టతకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దీనికి కారణం ఏమిటి? ఎవరి వత్తిడి ఉందని ఆయన ప్రశ్నించారు.
భారత జవాన్లకు కనీసం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను సమకూర్చడంలో సైతం కాంగ్రెస్ విఫలమైందని ఆయన ఆరోపించారు. 1.86 లక్షల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కావాలని అప్పటి యూపీఏ-2 ప్రభుత్వాన్ని ఆర్మీ కోరగా ఒక్కటి కూడా కొనుగోలు చేయలేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 2016లో 50వేల జాకెట్లను కొనుగోలు చేశామని ఆయన వివరించారు. అలాగే ఈ ఏడాది మరో 1.86 జాకెట్ల కొనుగోలుకు ఆర్డన్ ఇచ్చామని ప్రధాని మోదీ తెలిపారు.

చిత్రం..ఉత్తరప్రదేశ్‌లోని కుంభమేళ ప్రాంతాన్ని ఆదివారం సందర్శించిన అనంతరం హారతి ఇస్తున్న ప్రధాని మోదీ,
రాష్టగ్రవర్నర్ రామ్‌నాయక్, ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్.