జాతీయ వార్తలు

ఇబ్బందుల్లో ప్రజలు.. ప్రమాణ స్వీకారోత్సవాల్లో బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలన్నీ అమలు చేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఎంపీలు పార్లమెంట్ బయటా, లోపాలా ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనను వ్యక్తం చేశారు. రాజ్యసభ సమావేశాలు ప్రారంభం కాగానే చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి విజయ సాయిరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి ప్లకార్డులు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం విజయ సాయిరెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ ప్రత్యేకహోదా సాధనపై తెలుగుదేశం ఎంపీలను చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. రాజ్యసభలో నిరసన వ్యక్తం చేసేందుకు కూడ టీడీపీ ఎంపీలు రావడం లేదని అన్నారు. బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరపాలని చంద్రబాబు డిమాండ్ చేయడం అర్థం లేదని అన్నారు. ఈవీఎంలకు ట్యాంపరింగ్ చేయడం చంద్రబాబుకు బాగా తెలుసునని, ఇప్పుడు ఆయన ఎత్తులు సాగవని తెలిసే భయపడుతున్నారని ఆరోపించారు. తుపానుతో ఏపీ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు మాత్రం ప్రమాణ స్వీకారోత్సవాలకోసం యాత్రలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.