జాతీయ వార్తలు

4గంటలు ఎయిర్‌పోర్ట్‌లోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్, ఫిబ్రవరి 14: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం డెహ్రాడూన్‌లోని జోలి గ్రాంట్ విమానాశ్రయంలో సుమారు నాలుగు గంటల సేపు ఉండిపోవాల్సి వచ్చింది. అననుకూల వాతావరణం కారణంగా ఆయన ప్రయాణించాల్సిన హెలికాప్టర్ టేకాఫ్ కాకపోవడం వల్ల ఆయన విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. ప్రధానమంత్రి గురువారం ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్‌లో ఒక ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉండింది. ఇందుకోసం ఆయన ఉదయం ఏడు గంటలకే ఇక్కడి విమానాశ్రయంలో దిగారు. కాని, అననుకూల వాతావరణం వల్ల ఆయన ప్రయాణించాల్సిన హెలికాప్టర్ టేకాఫ్ కాలేకపోయింది. చివరకు వాతావరణం మెరుగుపడిన తరువాత సుమారు 11.15 గంటలకు ఆయన ప్రయాణం మొదలయింది. ఇక్కడ గురువారం తెల్లవారు జామునుంచే వర్షం కురుస్తూ ఉండింది. హెలికాప్టర్ టేకాఫ్ కాకపోవడంతో మోదీ విమానాశ్రయంలోని గెస్ట్‌హౌస్‌లో వేచి ఉన్నారని ఒక పోలీసు అధికారి తెలిపారు. వాతావరణం మెరుగుపడిన తరువాత ప్రధాని ఎంఐ-17 హెలికాప్టర్‌లో కోర్‌బెట్ టైగర్ రిజర్వ్‌కు బయల్దేరారు. ఉధం సింగ్ నగర్ జిల్లాలోని రుద్రాపూర్‌కు వెళ్లడానికి ముందు ఆయన కోర్‌బెట్ టైగర్ రిజర్వ్‌లో కొంతసేపు గడిపారు.