జాతీయ వార్తలు

ఆర్మీ మేజర్ దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ: భారత్ పాక్ వాస్తవాధీన రేఖ వద్ద జరిగిన పేలుళ్లలో ఒక ఆర్మీ మేజర్ మరణించగా, మరో జవాను గాయపడ్డారు. ఈ ఘటన జమ్మూలోని రాజౌరి జిల్లా వద్ద జరిగింది. ఈ మందుపాతర్లను పాకిస్తాన్ సైనికులు అమర్చి ఉంటారని పోలీసులు చెప్పారు. భారత సరిహద్దులోపల నౌషీరియా సెక్టార్‌లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు. గస్తీలో ఉన్న వాహనం మందుపాతర్లు అమర్చిన ప్రదేశం మీదుగా వెళుతుండగా, ఈ పేలుళ్లు సంభవించాయి. ఈ నెల 14వ తేదీన శ్రీనగర్ జాతీయరహదారిపైన ఉగ్రవాది ఆత్మాహుతి దాడిలో 44 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించిన విషయం విదితమే. ఈ ఘటన జరిగిన 48 గంటల్లోపలే ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఇదే ప్రాంతంలో మందుపాతర్లు పేలిన ఘటనలో ఇద్దరు ఆర్మీ సిబ్బంది మరణించారు.