జాతీయ వార్తలు

భద్రతా పరిస్థితులను సమీక్షించిన రాజ్‌నాథ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం దేశంలో ప్రత్యేకించి జమ్మూకాశ్మీర్‌లో భద్రతా పరిస్థితులను సమీక్షించారు. రెండు రోజుల క్రితం గురువారం కాశ్మీర్‌లోని పుల్వామాలో జైష్ ఎ మొహమ్మద్ (జేఈఎం) ఉగ్రవాద సంస్థ జరిపిన భయంకరమయిన ఆత్మాహుతి బాంబు దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందిన నేపథ్యంలో హోంమంత్రి దేశంలో భద్రతా పరిస్థితులను సమీక్షించారని అధికారులు తెలిపారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉన్నత స్థాయి భద్రతాధికారులు భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో సహా దేశంలో నెలకొన్న పరిస్థితులను హోంమంత్రికి వివరించారని హోంమంత్రిత్వ శాఖకు చెందిన ఒక అధికారి తెలిపారు. జమ్మూకాశ్మీర్, ఇతర ప్రాంతాల్లో శాంతియుత పరిస్థితులను దెబ్బతీయడానికి పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులు ఎలాంటి కుట్రలు పన్నినా వాటిని భగ్నం చేయడానికి తీసుకున్న భద్రతా చర్యలను ఈ సమావేశంలో సమీక్షించారు. ప్రస్తుతం కాశ్మీర్ లోయలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాదులను అణచివేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని రాజ్‌నాథ్ సింగ్ అధికారులను ఆదేశించారని మరో అధికారి తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్న వారిలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ రాజీవ్ జైన్ తదితరులు ఉన్నారు.