జాతీయ వార్తలు
కంచ ఐలయ్య స్వీయచరిత్ర పుస్తకావిష్కరణ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 19 February 2019
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: ప్రొఫెసర్ కంచ ఐలయ్య స్వీయచరిత్ర ‘షెప్హార్ట్ బాయ్ టు యాన్ ఇంటెలెక్చువల్-మై మెమోరీస్’ పుస్తకావిష్కరణ కార్యక్రమం సోమవారం ఢిల్లీలో జరిగింది. పబ్లిషర్ మందిరా సేన్, ప్రొఫెసర్ ఉమా చక్రవర్తి తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కంచ ఐలయ్య మాట్లాడుతూ తాను ఎదుర్కొన్న వివక్ష, ఇటీవల తనపై జరిగిన దాడులు స్వీయచరిత్ర రాసేందుకు దోహదం చేశాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఇంగ్లీషు నేర్పించడం వల్ల భారతదేశం చైనాను అధిగమిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.