జాతీయ వార్తలు

టాగూర్‌ను అవమానిస్తే బెంగాల్ జనం క్షమించరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపూర్, మార్చి 29: పశ్చిమ బెంగాల్‌లో బాంబుల శబ్దాల మధ్య రవీంద్రనాథ్ టాగూర్ సంగీత శబ్దాలు వినిపించడం లేదంటూ బిజెపి అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రాన్ని అవమాన పరిచేవారికి తనకన్నా పెద్ద శత్రువు మరొకరుండరని పురులియా జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలలో మాట్లాడుతూ మమత అన్నారు. బిజెపి అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ‘అమిత్ షా రవీంద్రనాథ్ గురించి ఏవో వ్యాఖ్యలు చేసినట్లు నేను విన్నాను. రవీంధ్రనాథ్ టాగూర్, నజ్రుల్ ఇస్లాంలాంటి కవులను అవమానపరిచే వారిని బెంగాల్ ప్రజలు క్షమించరు’ అని ముఖ్యమంత్రి అన్నారు. కాగా, మంగళవారం ఉదయం కోల్‌కతాలో విలేఖరుల సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ, తృణమూల్ కాంగ్రెస్ పాలనలో బెంగాల్‌లో వచ్చిన ఏకైక పరిశ్రమ బాంబుల తయారీ పరిశ్రమేనని అన్నారు.