జాతీయ వార్తలు
మలేరియా, చికెన్గున్యా వ్యాధుల నివారణకు కృషి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 18 March 2019
న్యూఢిల్లీ, మార్చి 18: దేశంలో దోమకాటుతో వచ్చే మలేరియా, చికెన్గున్యా వంటి వ్యాధులను నివారించేందుకు కృషి చేస్తున్నామని ఎస్ఆర్ఎం యూనివర్శిటీ వైఎస్ ఛాన్సలర్ డా. పీ.ప్రకాశ్ వెల్లడించారు. ఎస్ఆర్ఎం యూనివర్శిటీ ఆధ్వర్యంలో సానిపాట్లోని ఢిల్లీ ఐఐటి క్యాంపస్లో యాంటిమైక్రోబయల్ రిసిస్టెన్స్ నవల్ డ్రగ్ డిస్కవరీ పేరుతో మూడు రోజులపాటు అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది. సోమవారం జరిగిన సదస్సులో ప్రముఖ నోబెల్ అవార్డు గ్రహీత ప్రొ. ఆదాయోనాతా ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాశ్ మాట్లాడుతూ దోమకాటుతో వచ్చే మలేరియా, చికెన్గున్యా వంటి వ్యాధుల నివారణకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ అవి ఇంకా సఫలం కావడం లేదని చెప్పారు.