జాతీయ వార్తలు

పాట్నాలో వినూత్న రీతిలో హోలీ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, మార్చి 21: బిహారీ ప్రజలు ఈసారి వినూత్న రీతిలో హోలీ పండగ వేడుకలను నిర్వహించారు. పాట్నాలోని కేకే నవాల్ కిషోర్ రోడ్డులో ప్రజలు కామదహనం బదులు ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ సంస్థ చీఫ్ మసూద్ అజార్, ముంబయి పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సరుూద్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. వేడుకల సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడి కామదహనం బదులు కట్టెలతో చితిపేర్చి వాటిపైన ఈ ఇద్దరు ముష్కరుల దిష్టిబొమ్మలను పెట్టి దగ్ధం చేశారు. పైగా ఈ రోడ్డులో ఎక్కడ చూసినా భారత జవాన్లు తుపాకులతో యుద్ధం చేస్తున్న బొమ్మలను ఉంచారు. పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ పాక్ భూభాగం కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగేందుకు అనుమతిస్తే ఖబడ్దార్ అంటూ నినాదాలు చేశారు. దిష్టిబొమ్మలపై ఉగ్రవాద ముష్కరుల చిత్రపటాలను అతికించారు. దిష్టిబొమ్మల పక్కన పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ ప్లకార్డులను రాసి ఉంచి వాటిని కూడా దహనం చేశారు. ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే అంటూ భారత్ వైమానిక దాడులను సమర్థిస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. హోలీ పండగ సందర్భంగా పాట్నా పౌరులు పాకిస్తాన్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేయడమే కాకుండా భారత్ జవాన్లకు బాసటగా నిలుస్తామని సందేశం ఇచ్చారు.