జాతీయ వార్తలు

ఓట్ల కొనుగోలుకు టీడీపీ యత్నం: జీవిఎల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 22: తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో దోచేసిన అవినీతి సొమ్మును ఉపయోగించి ఎన్నికల్లో నెగ్గేందుకు కుట్రలు చేస్తోందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావుకేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈసీని కలిసిన తరువాత విలేఖరులతో మాట్లాడుతూ టీడీపీ నేతలు దోచిన సొమ్ములతో ఓట్లను కోనేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు. దీన్ని అడ్డుకునేందుకు ఏపీకి ప్రత్యేక ప్రత్యేక ఎన్నికల పరిశీలకులను పంపాలని ఈసీని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఐదేశ్ల పాలనలో రాష్ట్రాన్ని తన సొంత మనుషులకు దోచిపెట్టారని, ఎన్నికల్లో వారినే అభ్యర్థులుగా ప్రకటించారని జీవీఎల్ విమర్శించారు.