జాతీయ వార్తలు

మోదీని సాగనంపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 24: దేశంలో హిట్లర్ తరహా పాలనను కొనసాగిస్తున్న నరేంద్ర మోదీని ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో ఓడించాలని, అలా జరుగకుంటే ఎల్లకాలం ఆయనే ప్రధానిగా ఉండే ప్రమాదం ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ద్వారా కేంద్రంలో మళ్లీ ఆ పార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని ఆయన కోరారు. ప్రస్తుతం మన దేశం అత్యంత ప్రమాదంలో పడిందని, ప్రజాస్వామ్య వ్యవస్థ నాశనం అవుతోందని, దేశాన్ని రక్షించేందుకు ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఇక్కడ జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ సిద్ధాంతాలను అవలంబిస్తున్నారు. దేశంలోని దేశభక్తిగల ప్రతిఒక్కరూ స్పందించడం ద్వారా కాషాయ పార్టీని ఎట్టిపరిస్థితుల్లోనూ గద్దె ఎక్కకుండా బాధ్యతగా ఓటేయాలి. 2019 ఎన్నికల్లో మోదీని ఓడించకుంటే ఆయనే ఎల్లకాలం ప్రధానిగా ఉంటారు’ అని అంటూ ఈ దిశగా ప్రజలు మేల్కోవాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రజలకు పిలుపునిచ్చారు. అదేవిధంగా గుర్గావ్‌లోని ముస్లిం కుటుంబంపై ఇటీవల అన్యాయంగా జరిగిన క్రూరమైన దాడిని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ మోదీ హయాంలో ఎన్నో రకాలుగా ఇబ్బందులు, దాడులు, దౌర్జన్యాలు, హత్యలు వంటి సంఘటనల్లో బాధ్యులైన మైనారిటీ ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సరైన సమాధానం చెప్పాలని విజ్ఞప్తి చేశారు.