జాతీయ వార్తలు

అబద్ధాలకోరు కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, మార్చి 24: అబద్ధాలు చెప్పడం, వాటితో ఎన్నికల్లో ప్రజల అభిమానంతో లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్‌లో పోటీ చేస్తే తప్పకుండా విజయం సాధిస్తుందని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ వ్యాఖ్యానించారు. పొరుగు దేశం పాక్ కంటే ఎక్కువగానే కాంగ్రెస్ నాయకులు అబద్ధాలతో కూడిన ప్రకటనలు చేయడంలో దిట్టలుగా తయారయ్యారని ఆయన పేర్కొన్నారు. ‘వాళ్ల వ్యాఖ్యలు, విమర్శలు చూస్తుంటే మన దేశం కంటే పొరుగున ఉన్న పాకిస్తాన్‌లో విస్తృత ప్రచారం జరగడానికి ఆస్కారం ఉంది. ఇపుడు అక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తే కాంగ్రెస్ తప్పకుండా విజయం సాధిస్తుందని. ఇదీ ప్రస్తుతం మన దేశంలోని ప్రధాన ప్రతిపక్షం తీరు’ అని రామ్ మాధవ్ ఆదివారం ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న ఏ అంశంపై కూడా కాంగ్రెస్ పోరాడడం లేదు. కేవలం మా నాయకుడు, మా పార్టీపైనే దృష్టి సారించింది. ఇది ఒకరకంగా చూసుకుంటే అబద్ధాలు చెప్పడంలో దిట్ట అయిన పాకిస్తాన్‌తో సమానం’ అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ‘ఆధారాలు లేని వాటిపై పోరాడుతోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అసలు మన దేశం కోసం పోరాడుతోందా? లేదా పాకిస్తాన్‌పైన అన్నది ప్రజలు అర్ధం చేసుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. భారత జవాన్ల త్యాగాలపై కూడా కాంగ్రెస్ నాయకులు సందేహాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలపై ప్రశ్నించకుండా కేవలం సాయుధ జవాన్ల త్యాగాలను అవమానించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.