జాతీయ వార్తలు

సాక్షి పత్రిక, చానల్‌పై టీడీపీ ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 25: సాక్షి పత్రిక, చానల్ నిబంధనలకు విరుద్ధంగా తెలుగుదేశం పార్టీపై దుష్ప్రచారం చేస్తూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకులంగా ప్రచారం చేస్తున్నాయని కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తెలుగుదేశం నాయకులు కనకమేడల రవీంద్రకుమార్, వర్ల రామయ్య కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఒక వినతిపత్రం సమర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి నేతృత్వంలో నడుస్తున్న పత్రిక, చానల్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని వినతిపత్రంలో పేర్కొన్నారు. అనంతరం కనకమేడల మాట్లాడుతూ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో తెలుగుదేశంపై అసత్య ప్రచారాలను చేస్తున్నాయని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. వైఎస్ వివేకానంద హత్య కేసును రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. నిష్పక్షపాతంగా పనిచేస్తున్న ఉన్నత అధికారులను బదిలీ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఈసీకి ఫిర్యాదు చేశారని మండిపడ్డారు. వర్ల రామయ్య మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయ సాయిరెడ్డి తెలుగుదేశం పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.