జాతీయ వార్తలు
కుప్పకూలిన భవనం: ఐదుగురి దుర్మరణం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 26 January 2020
న్యూఢిల్లీ, జనవరి 25: భజన్పురాలో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న ఓ భవనంలోని నాలుగవ అంతస్తు కుప్పకూలడంతో ఐదుగురు దుర్మరణం చెందారు. వీరిలో నలుగురు విద్యార్థులు ఉన్నారు. శనివారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో కోచింగ్ సెంటర్లో తరగతి నిర్వహిస్తున్న సమయంలో నాలుగవ అంతస్తు కుప్పకూలడంతో, 30 మంది విద్యార్థులపై ఇటుక పెళ్ళలు, దిబ్బల్లో విద్యార్థులు చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులతో సహ మొత్తం ఐదుగురు మృత్యువాతపడ్డారు. మిగతా వారు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.