జాతీయ వార్తలు

షాతో చర్చలు ఫలప్రదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి19: దేశ రాజధాని ఢిల్లీలో హ్యాట్రిక్ విజయం సాధించిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. బుధవారం ఢిల్లీలో జరిగిన సమావేశంపై సీఎం కేజ్రీవాల్ సంతృప్తి వ్యక్తం చేశారు. అమిత్ షా, కేజ్రీవాల్ మధ్య ఇరవై నిమిషాల పాటు సమావేశం జరిగింది. హోం మంత్రి నివాసంలోనే ఇరువురు నేతలు భేటీ అయ్యారు. షాతో సమావేశంపై సీఎం ట్వీట్ చేశారు.‘ అమిత్ షాజీని ఈ ఉదయం కలిశాను. మా ఇద్దరి మధ్య సుహృద్భావ వాతావరణంలో సమావేశం జరిగింది. ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై మేం ఇద్దరం చర్చించాం. ఢిల్లీ అభివృద్ధికి పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నాం’అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. హోం మంత్రితో సమావేశం ఫలప్రదమైంది ఆప్ చీఫ్ ప్రకటించారు. మొన్నటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌పై బీజేపీ రకరకాలైన విమర్శలు చేసింది. ముఖ్యంగా అమిత్ షా సారధ్యంలోనే పార్టీ ప్రచారం సాగిందని చెప్పవచ్చు. అయినప్పటికీ ఆప్‌కు 62 సీట్లు లభించాయి. బీజేపీకి ఎనిమిది స్థానాలు దక్కాయి.