జాతీయ వార్తలు

కర్నాటకలో బీజేపీని ఓడించేందుకు టీడీపీ, కాంగ్రెస్ కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు లాలూచీ రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహారావు ఆరోపించారు. ఢిల్లీలో సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ కర్నాటక ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ కలిసి అక్కడ బీజేపీని ఓడించేందుకు కుట్రలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాంగ్రెస్ నాయకులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారని ఆరోపించారు. తిరుపతిలో టీడీపీ చేపట్టిన దీక్షలో ప్రకృతి వైపరీత్యంవల్ల ఎల్‌ఈడి బాక్స్‌లు పగిలినట్టే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బ్యాలెట్ బాక్స్‌లు (ఈవీఎం) దగ్గర బోల్తాపడటం ఖాయమని అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నిరసన దీక్షల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి, పట్టిసీమలో అక్రమాల సంపాదనతో దీక్షలు చేస్తున్నారా? అని తెలుగుదేశం పార్టీని ప్రశ్నించారు. తిరుపతిలో టీడీపీ చేస్తున్న దీక్షలలో నీతి నిజాయితీ లేదని.. అందుకే ప్రకృతి కూడా సహకరించలేదని పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి రాజకీయ కోణంలో దీక్షలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. చంద్రబాబు ఇకనుంచి భ్రమ రాజకీయలు చేయనని తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రమాణం చేయాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.