జాతీయ వార్తలు

బీజేపీ పాలనపై రేటింగ్ ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 26: కేంద్రంలో బీజేబీ నాలుగేళ్ల పాలనపై తమ అభిప్రాయాలను తెలియచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను కోరారు. ఈ మేరకు రూపొందించిన యాప్‌ద్వారా ప్రజలు పాలనతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలపై అభిప్రాయాలను తెలియచేయాలన్నారు. తమ పాలనా తీరుపై రేటింగ్ ఇవ్వాలన్నారు. నమో యాప్ ద్వారా ప్రారంభించిన ఈ సర్వే కార్యక్రమాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్‌లో సందేశం ఇచ్చారు. మీ నియోజకవర్గంలో కేంద్రం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై అభిప్రాయాలు తెలియచేయాలని కోరారు. బీజేపీ ప్రతినిధులు మీ నియోజకవర్గంలో అందుబాటులో ఉంటున్నారా, ప్రజాదరణ పొందే పనులు చేస్తున్నారా అనే అంశాలపై అభిప్రాయాలు చెప్పాలన్నారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు ప్రజలకు ఏమాత్రం చేరుతున్నాయనే విషయమై తమకు స్పష్టత వస్తుందన్నారు. ప్రజలు, పార్టీ నేతలతో నమో యాప్ ద్వారా ప్రధాని మంత్రి అనుసంధానమవుతున్నారు. పెద్దనోట్ల రద్దుతో పాటు అనేక అంశాలపై 2016 నవంబర్‌లో ఈ యాప్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించారు.