జాతీయ వార్తలు
సుప్రీంకు టీటీడీ పంచాయితీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 14 June 2018
న్యూఢిల్లీ, జూన్ 13: తిరుమల తిరుపతి దేవస్థానం వివాదం మెల్లగా సుప్రీం కోర్టుకు చేరింది. మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు కంటే ముందుగానే ప్రస్తుత ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు బుధవారం సుప్రీం కోర్టు తలుపుతట్టారు. వేణుగోపాల తరఫున ఆయన న్యాయవాది సుప్రీం కోర్టులో కేవియేట్ దాఖలు చేశారు. టీటీడీలో వేణుగోపాల దీక్షితులను ప్రధాన అర్చకుడుగా నియమిస్తూ బోర్డు ఇచ్చిన జీవోను వ్యతిరేకిస్తూ ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే తనకు ముందస్తు సమాచారం తెలపకుండా, ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకూడదని కేవియెట్ దాఖలు చేశారు. తనను పదవి నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ రమణ దీక్షితులు సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానని గతంలో ప్రకటించింది తెలిసిందే.