జాతీయ వార్తలు

ఆ వ్యాఖ్యలు కాంగ్రెస్‌ను ఉద్దేశించి కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూలై 17: ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలతో జెడి(ఎస్), కాంగ్రెస్ మధ్య సంబంధాలు చెడిపోయాయని మీడియాలో వస్తున్న వార్తలను కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఖండించారు. అవి తాను కాంగ్రెస్‌ను ఉద్దేశించి చేసినవి కావని ఆయన వివరణ ఇచ్చారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ‘సంకీర్ణ ప్రభుత్వంలోని బాధ ఇప్పుడు తెలుస్తోంది ’ అంటూ తాను చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని గురించి గాని, ఆ పార్టీ నేతల గురించి గాని చేసినవి ఎంతమాత్రం కాదని స్పష్టం చేశారు. ‘నా ప్రసంగంలో కాంగ్రెస్ గురించి గాని, ఆ పార్టీ నాయకుల గురించి గాని మాట్లాడలేదు. కనీసం ఆ పార్టీ ప్రస్తావనే తీసుకురాలేదు, కేవలం అది మా పార్టీ కార్యక్రమం మాత్రమే. ఆ సమయంలో ఎందుకో ఉద్వేగం ఆపుకోలేకపోయాను, కాని మీడియా దానిని తప్పుగా అర్థం చేసుకుంది’ అని కుమారస్వామి తెలిపారు. ఇలావుండగా శనివారం జరిగిన పార్టీ కార్యక్రమంలో కుమారస్వామి ఉద్వేగంతో కన్నీరుపెట్టుకున్న విషయం ప్రచార సాధనాలలో విస్తృతంగా వైరల్ అయ్యింది. ఆ కార్యక్రమంలో కుమారస్వామి మాట్లాడుతూ ‘మీ అన్నో తమ్ముడో ముఖ్యమంత్రి అయితే మీరు సంతోషంగా ఉండవచ్చునేమో కాని, నేను మాత్రం సీఎంని అయినా సంతోషంగా లేను, సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న బాధ నాకు తెలుసు, గరళం మింగిన శివునిలా ఉంది నా పరిస్థితి’ అని పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలే పలు అనుమానాలకు దారితీయడంతో కుమారస్వామి వివరణ ఇచ్చారు.