జాతీయ వార్తలు

సోషల్ మీడియాను నియంత్రించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్‌ను తమ ప్రభుత్వం నియంత్రించదని, తమ ప్రభుత్వం ప్రజల వాక్‌స్వాతంత్య్రం, భావస్వేచ్ఛకు ఎలాంటి భంగం కలిగించదని, వాటి పరిరక్షణకు కట్టుబడి ఉందని ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి కేంద్ర సహాయమంత్రి ఎస్‌ఎస్ అహ్లూవాలియా పార్లమెంట్‌లో స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న రాతలు, ఇతర విషయాలపై ప్రభుత్వం ఎలాంటి నియంత్రణ విధించదని, అందులోని విషయం విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోదని, అయితే కొన్ని ప్రత్యేక కేసుల్లో దర్యాప్తు సంస్థలు చట్టప్రకారం చర్యలు తీసుకుంటాయని ఆయన చెప్పారు. సామాజిక మాధ్యమాల నియంత్రణకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, భావస్వేచ్ఛకు అడ్డుకట్ట వేస్తోందని కొందరు సభ్యులు లేవెనెత్తిన ప్రశ్నలపై మంత్రి ఆహ్లువాలియా సమాధానం ఇస్తూ సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలు విస్తృతంగా ప్రచారంమవుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం సమాజంలోని ప్రజలకు తమ భావాలు, అభిప్రాయాలు పంచుకునే, చేరవేసే అతి ముఖ్య సాధనం సామాజిక మాధ్యమమని పేర్కొన్నారు. అయితే కొందరు నకిలీ అకౌంట్లు సృష్టించి దీనిని దుర్వినియోగం చేస్తున్నారని, స్వార్థ ప్రయోజనాల కోసం, సమాజంలో అశాంతిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మాధ్యమాన్ని ఎవరైనా పంచుకునే అవకాశం ఉన్నందున కొందరు సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు వేదికగా చేసుకుంటున్నారన్నారు. ఇన్ఫర్‌మేషన్ టెక్నాలజీ చట్టం 2000 ప్రకారం అభ్యంతరకర విషయం ఉన్న వాటిని అడ్డుకునే, తొలగించే హక్కు ప్రభుత్వానికి ఉందని ఆయన చెప్పారు. రాజ్యాంగం కల్పించిన పౌరుల భావస్వేచ్ఛకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.