జాతీయ వార్తలు

మీ త్యాగాలు చిరస్మరణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 15: ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా వచ్చిన స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ మువ్వనె్నల జెండా ఎగరేశారు. మాజీ ప్ర ధాని మన్మోహన్‌సింగ్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, కాంగ్రెస్ సీనియర్ నేతలు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రాహుల్ ‘మహనీయుల త్యాగాలను నెమరువేసుకుంటూ దేశ సమగ్రత, సమైఖ్యతకు అంకితమవుదాం’ అన్నారు. సమరయోధుల కృషి వృథా కాకూడదని స్పష్టం చేశారు. దేశ ఐక్యతకు పునరంకితం కావాలని కాంగ్రెస్ అధినేత పిలుపునిచ్చారు.