జాతీయ వార్తలు

కాశ్మీర్ లోయలో ఈద్ సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఆగస్టు 22: కాశ్మీర్ లోయ అంతటా ముస్లింలు బుధవారం ఈద్-ఉల్-అధా సంబరాలను జరుపుకున్నారు. తెల్లవారుజామునే ఈద్గా లు, మసీదులకు చేరుకున్న ముస్లిం సోదరులు ఘనంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చిన్నా, పెద్ద తారతమ్యం లేకుండా పురుషులు, మహిళలు తమ సంప్రదాయ దుస్తులతో ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాభినందనలు తెలుపుకున్నారు. కాశ్మీర్ లోయలోని అల్లోచీభాగ్ తదితర ప్రాంతాలతోపాటు జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాల్లో వేలాదిమంది వేడుకగా బక్రీద్‌ను జరుపుకున్నారు. శ్రీనగర్, అనంతనాగ్‌లోని జంగ్లాట్ మండి, బారాముల్లాలోని సోపోర్ వంటి పలు ప్రాంతాల్లో ప్రార్థనల అనంతరం కొంతమంది పోలీసులపై రాళ్లు రువ్విన సంఘటనలు జరిగాయి. స్వల్ప ఘటనలు మినహా లోయ అంతటా ప్రశాంతంగా ఈద్ వేడుకలు జరిగాయని పోలీస్ అధికార ప్రతినిధి తెలిపారు.