జాతీయ వార్తలు

నవాజ్ షరీఫ్‌పై విషప్రయోగం:కుమారుడి ఆరోపణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తన తండ్రిపై విష ప్రయోగం జరిగిందని నవాజ్ షరీఫ్ కుమారుడు హుస్సేన్ తీవ్ర ఆరోపణలు చేశారు. అందుకే ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, ప్లేట్‌లైట్ సంఖ్య 16000లకు పడిపోయిందని అన్నారు. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న ఆయనను ఎందుకు ఆలస్యంగా ఆసుపత్రికి తరలించలేదని, ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. వివిధ కేసుల్లో దోషిగా తేలిన షరీఫ్ ప్రస్తుతం జైలు శిక్షను అనుభవిస్తున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను లాహోర్ లోని 'ది సర్వీస్' ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆ ఆసుపత్రినే జైలుగా మార్చేశారు. మరోవైపు, షరీఫ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు.