జాతీయ వార్తలు

‘నీట్’ ఆర్డినెన్స్‌పై కేంద్ర క్యాబినెట్ కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లకు దేశవ్యాప్త ప్రవేశ పరీక్ష (నీట్)నుంచి రాష్ట్రాలకు ఈ ఏడాది మినహాయింపు ఇచ్చేలా ఆర్డినెన్స్ జారీ చేయాలని కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇక్కడ శుక్రవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ప్రారంభమైన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ ఆర్డినెన్స్‌పై చర్చ జరుగుతోంది. ‘నీట్’ నుంచి ఈ ఏడాది మినహాయించాలని ఇటీవల పలు రాష్ట్రాలు ప్రధానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి నడ్డా అధ్యక్షతన రాష్ట్రాల ఆరోగ్యమంత్రులతో జరిగిన సమావేశంలోనూ ఇదే అంశంపై చర్చ జరిగింది.