జాతీయ వార్తలు

ఆరోజు ఎంతో ప్రత్యేకం:నిర్భయ తల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జనవరి 22తేదీ తమకు ఎంతో ప్రత్యేకమని, ఆరోజను తన జీవితంలో మర్చిపోలేనిదని నిర్భయ తల్లి ఆశాదేవి అన్నారు. సుప్రీం కోర్టు తీర్పుపై ఆమె మీడియాతో స్పందిస్తూ ఏడేళ్ల తన పోరాటం ఫలించిందని, ఈ ఏడేళ్లు తమ బాధ వర్ణణాతీతమని అన్నారు. కాని దోషులను ఉరి తీసిన రోజే తనకు అత్యంత సంతోషకరమైనదని అన్నారు. ఇదిలావుండగా ఏడేళ్ల క్రితం ఢిల్లీలో పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఆమెపై అతి క్రూరంగా వ్యవహరించారు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం కలిగించింది. ఈ ఘటనలో దోషులైన నలుగురు ముఖేశ్ సింగ్, అక్షయ్‌కుమార్ సింగ్, వినయ్‌శర్మ, పవన్ గుప్తాలను ఈ నెల 22న ఉరి తీయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈలోగా న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవాలని సూచించింది. ఇందులో భాగంగా దోషులైన వినయ్ శర్మ, ముఖేష్ సింగ్ సుప్రీం కోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను కొట్టివేస్తూ సుప్రీం కోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు ఇచ్చింది.