'క్లాప్' కొట్టు గురూ!

ప్రేమలో నిత్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారల జీవితాల్లో జరిగే ప్రతీ సంఘటన పెద్ద వార్తగా సంచలనం సృష్టించడం మామూలుగా జరిగే విషయయే. అయితే అదే కథానాయికల విషయంలో అయితే మరీ ప్రధానవార్తయిపోతుంది. సరిగ్గా ఇలాంటి సంచలన కబురొకటి చిత్రసీమలో కోడైకూస్తోంది. అదే అందాలతార నిత్యామీనన్ విషయంలో. కన్నడ సూపర్‌స్టార్ సుదీప్ ఎస్.ఎస్.రాజవౌళి ‘ఈగ’, ‘బాహుబలి’ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన విషయం తెలిసిందే. ప్రస్తుతం సుదీప్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఇందులో అతడి సరసన నిత్యామీనన్ నటిస్తోంది. అయితే వీరిద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారిందని అందరూ చెప్పుకుంటున్నారు. కోలీవుడ్‌లో అయితే మరీ సంచలన వార్తగా గుప్పుగుప్పుమంటోందిట. అంతేకాదు, ప్రతీ ఫంక్షన్‌కూ వీరిద్దరూ కలిసే వెళుతున్నారట. అలా కూడా వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధమేర్పడిందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సుదీప్ తన భార్యతో విభేదాలు ఏర్పడడం వల్ల పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నట్లు కోలీవుడ్ పత్రికలు గగ్గోలు పెడుతున్నాయి. అదీ..సంగతీ!
ప్చ్..సాయేశా!
అంటున్నారంతా టాలీవుడ్‌లో. నాగార్జున తనయుడు అఖిల్‌ని హీరోగా పరిచయం చేస్తూ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘అఖిల్’. ఇందులో అఖిల్‌కు జోడీగా చక్కటి నటనను ప్రదర్శించిన సాయేశా సైగల్ టాలీవుడ్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. టాలీవుడ్‌లో అడుగుపెడుతూనే అగ్రహీరో నాగార్జున తనయుడితో నటించే అవకాశం రావడం అంటే మాటలు కాదు. అలా ఎనె్నన్నో ఆశలు పెట్టుకుంది. తెలుగు చిత్రసీమలో ఓ వెలుగు వెలగాలనుకుంది. బాలీవుడ్ బడా ఫ్యామిలీకి చెందిన ఈ సాయేశా నటించిన తొలి చిత్రమే ఇలా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టడంతో ఇక టాలీవుడ్‌వైపు మరోసారి కనె్నత్తి కూడా చూడనంటోందిట. సినిమా కథ, కథనం మొత్తం హీరోయిన్‌వైపు నుండే నడిచినా ప్చ్..సాయేశా పాత్రకు మాత్రం ఎలాంటి ఔచిత్యం లేకుండా పోవడంతో ఆమెకు వేదననే మిగిల్చింది. పాటల్లో కూడా అఖిల్ దీటుగానే నృత్యం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఎవ్వరెన్ని చెప్పినా టాలీవుడ్‌వైపునకు మాత్రం సాయేశా దరిదాపుల్లోకి రానేరానంటోందిట. ప్చ్..సాయేశా..బ్యాడ్‌లక్!!
డీ-గ్లామర్ రోల్!
అవును. నిజంగా నిజమే. అందాలతార సమంత డీ-గ్లామర్ పాత్రలో కనిపించనుందట. ‘ఏ మాయ చేసావె’ చిత్రంలో నాగచైతన్యకు జోడీగా టాలీవుడ్‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలో ఎన్నో మంచి చిత్రాలు చేసింది. అంతేకాదు, అగ్ర హీరోలతోనూ ఆడిపాడింది. అయితే నటించిన సినిమాలన్నింటిలోనూ గ్లామర్ పాత్రలనే పోషించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. డీ-గ్లామర్‌వైపు కనె్నత్తి కూడా చూడలేదు. ఇప్పుడు తాజాగా సమంత నటించబోయే చిత్రంలో ఆమెది డీ-గ్లామర్ రోల్ అని చెప్పుకుంటున్నారు. తమిళ దర్శకుడు వెట్టిమారన్ ప్రస్తుతం ‘వాడా చెన్నై’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో ధనుష్ జోడీగా సమంత కనిపించబోతోంది. అదీ..డీ-గ్లామర్ రోల్‌లో. మురికివాడలో నివశించే ఓ అమ్మాయిగా సమంత కనిపించనుందట. ఇలాంటి పాత్రలో కనిపించడానికి సమంత పెద్ద సాహసమే చేసిందని కోలీవుడ్డేకాదు, టాలీవుడ్డూ చెప్పుకుంటోంది. అందాలభామగా చూసిన ఆమె అభిమానులు ఇప్పుడు సమంతను ఇలా చూడడానికి ఇష్టపడతారో లేదో చూడాల్సిందే మరి!

-సమీర్