జాతీయ వార్తలు

ఢిల్లీలో మరో దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 25: ఢిల్లీలోని పుల్ ప్రహ్లాద్‌పూర్ ప్రాంతంలో 13 ఏళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా అత్యాచారం జరిపి ఆ తర్వాత రైల్వే ట్రాక్ సమీపంలో పడేశారని పోలీసులు తెలిపారు. అనాథ అయిన ఆ బాలికను అఖిల భారత వైద్య శాస్త్రాల అధ్యయన సంస్థ (ఎయిమ్స్)లో చేర్చారు. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పుల్ ప్రహ్లాద్‌పూర్ సమీప గ్రామంలో తన మేనమామ ఇంట్లో ఉంటున్న ఆ బాలిక ఈ నెల 17వ తేదీన కనిపించకుండా పోయిందని, బాలికకోసం గాలింపు జరిపినప్పటికీ ఫలితం దొరకలేదని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అయితే 18వ తేదీ తెల్లవారుజామున రైల్వే ట్రాక్ సమీపంలో ఆ బాలిక అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు బాలికను వెంటనే ఎయిమ్స్‌కు తరలించారు. బాలికపై లైంగిక దాడి జరిగిందని డాక్టర్లు ధ్రువీకరించారని, దీంతో సంబంధిత సెక్షన్ల కింద, చిన్నారులపై లైంగిక నేరాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. అయితే నిందితులను ఇంకా అరెస్టు చేయలేదు. కాగా, ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ బుధవారం ఎయిమ్స్‌కు వెళ్లి బాలికను చూశారు. బాలికను దారుణంగా రేప్ చేశారని, బహుశా ఇది సామూహిక అత్యాచారమయి ఉండవచ్చని అనుమానిస్తున్నామని ఆమె అన్నారు. కాగా, ఢిల్లీ పోలీసులు అధికారికంగా తమకు ఈ సంఘటన గురించి తెలియజేయలేదని కూడా ఆమె చెప్పారు.