జాతీయ వార్తలు

4వేల మందిని మట్టుబెట్టండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 26: భారత్, అమెరికా, ఫ్రాన్స్ సహా ప్రపంచ వ్యా ప్తంగా 5వేల మందిని చంపేస్తామం టూ ఐసిస్ ఓ జాబితా విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల నిఘా సంస్థల్లోనూ అలజడి రేకెత్తిస్తున్న ఈ ‘మరణ’శాసనాన్ని ఐసిస్‌కు అనుబంధంగా ఉన్న కలీఫా సైబర్ ఆర్మీ (సిసిఎ) జారీ చేసింది. 285మంది భారతీయులు కూడా ఉన్న ఈ జాబితాలో మొత్తం 4వేల మంది ఇమెయిల్స్, వారి చిరునామాలను కూడా ప్రచురించింది. వీరందరినీ మట్టుబట్టాలని తన మద్దతుదారులకు పిలుపునిస్తూ పూర్తి వివరాలతో కూడిన వారి జాబితానూ పంపినట్టు తెలుస్తోంది. వీరిలో ఎవర్నీ వదలద్దని, తక్షణమే దాడులు చేసి చంపేయాలని పిలుపునిచ్చింది. మిలిటెంట్లను ఎప్పటికప్పుడు ఎదుర్కోవడంలో భారత ప్రభుత్వానికి అన్ని విధాలా తోడ్పడుతున్న భారత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే ఈ జాబితాలో ఎక్కువగా ఉన్నట్టు తాజా కథనాలను బట్టి స్పష్టం అవుతోంది.