జాతీయ వార్తలు

విజయవాడ కాల్‌మనీ దురాగతాలపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: విజయవాడలో వేళ్లూనుకున్న కాల్‌మనీ రక్కసికి చిక్కిన మహిళలను రక్షించడానికి వెంటనే తగిన చర్యలు తీసుకోవలసిందిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు జాతీయ మహిళా కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్రరావు, జెడి శీలం, జైరామ్ రమేష్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ మంగళవారం కమిషన్ సభ్యులతో సమావేశమై కాల్‌మనీ దురాగతాలను వివరించారు. తీసుకున్న రుణాలను చెల్లించినప్పటికీ మహిళలను నిర్వహకులు వేధిస్తూ వ్యభిచారం చేయమని వత్తిడి చేస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు. పలువురు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కూడా ఈ వ్యవహాంలో కీలక పాత్రధారులుగా ఉన్నందున కేసులను నీరుకార్చే ప్రమాదం ఉందని కాంగ్రెస్ ప్రతినిధి వర్గం వివరించింది. కమిషన్ వెంటనే తగిన చర్యలు తీసుకుని బాధితులను ఆదుకోవాలని కాంగ్రెస్ నేతలు కోరారు