జాతీయ వార్తలు

బంగారు బాబు ఫుగే దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూణె, జూలై 15: బంగారు బాబుగా మెరిసిపోయే పసిడి చొక్కాతో అందరి దృష్టిని ఆకర్షించిన 48 ఏళ్ల పూణె వ్యాపారవేత్త దత్త్ఫాగే దారుణహత్యకు గురయ్యాడు. కన్నకొడుకు ముందే అతడిని దండుగులు హతమార్చినట్టుగా పోలీసులు శుక్రవారం వెల్లడించారు. దాదాపు మూడున్నర కిలోల బరువు, కోటీ 25 లక్షల ఖరీదు కలిగిన బంగారు చొక్కాతో 2012లో దత్త్ఫాగే వార్తల్లోకి ఎక్కాడు. గురువారం రాత్రి 11.30 ప్రాంతంలో ఇక్కడకు సమీపంలోని దిఘి ప్రాంతంలో ఫుగేపై 12 మంది బహిరంగంగానే రాళ్లతోనూ పదునైన ఆయుధాలతోనూ దాడి చేశారని ఆయన అక్కడికక్కడే మరణించాడని పోలీసులు తెలిపారు. పుట్టిన రోజు పార్టీకి రమ్మంటూ దాడి చేసిన ఓ వ్యక్తే ఆహ్వానించడంతో ఫుగే తన కుమారుడితో కలిసి వెళ్లినట్టు ప్రాధమిక సమాచారం అందినట్టు పోలీసులు చెప్పారు. అసలు ఈ ప్రాంతానికి ఫుగే ఎలా చేరుకున్నాడన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. తనకు కూడా పుట్టిన రోజు ఆహ్వానం అందడంతో 22 ఏళ్ల ఫుగే కుమారుడు కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. అప్పటికే తన తండ్రిపై రాళ్లతోనూ పదునైన ఆయుధాలతోనూ దాడి జరుపుతూ కొందరు వ్యక్తులు హతమార్చడాన్ని అతడు కళ్లారా చూశాడని పోలీసులు తెలిపారు.