జాతీయ వార్తలు

వారి త్యాగం చిరస్మరణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 26: భారత్‌పై యుద్ధానికి కాలుదువ్విన పాకిస్తాన్‌ను తరిమికొట్టడంలో అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించి ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలు చిరస్మరణీయమని ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. కార్గిల్ సెక్టర్‌లోని కీలక స్థావరాలను చేజిక్కించుకునేందుకు పాకిస్తాన్ ప్రదర్శించిన దుస్సాహసాన్ని భారత జవాన్లు ఎంతో ధైర్యంతో తిప్పికొట్టి తిరుగులేని గుణపాఠం చెప్పారని ఆయన ప్రశంసించారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, 1999లో రాజకీయ నాయకత్వం చూపిన తెగువ గర్వించదగిందని, నాడు తీసుకున్న నిర్ణయం భారత్‌పై కాలుదువ్వే శక్తులకు ఎప్పటికీ ఓ సమాధానంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. కార్గిల్ యుద్ధంలో జవాన్లు ప్రదర్శించిన అసమాన ధైర్య సాహసాలను, ప్రాణత్యాగాలను దేశం ఎప్పటికీ మరువదని తెలిపారు. దేశంకోసం పోరాడిన ప్రతి సైనికుడికి శిరస్సు వంచి నివాళులర్పిస్తున్నానని, వారి త్యాగం, ధైర్యం మాకు స్ఫూర్తిదాయకమని మోదీ పేర్కొన్నారు.
chitram...
ఢిల్లీలో మంగళవారం జరిగిన బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ