జాతీయ వార్తలు

ప్రజలతో మమేకం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 2: పరిస్థితులు, పరిసరాలపట్ల సున్నితంగా మెలగాలని, ప్రజలతో మమేకం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐఏఎస్‌లుగా నియమితులైన కొత్త అధికారులకు హితవు చెప్పారు. 2-14బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారులు, అసిస్టెంట్ సెక్రటరీల శిక్షణ ప్రారంభ సదస్సునుద్దేశించిన ఆయన మాట్లాడారు. తమ నైపుణ్యాన్ని పెంచుకునేందుకు, అనేక విషయాలను నేర్చుకునేందుకు ఇదొక మంచి అవకాశమని ఆయన వ్యాఖ్యానించారు. నైపుణ్యాన్ని మెరుగు చేసుకోవాలని, కార్యదక్షతను పెంపొందించుకోవాలని మోదీ పేర్కొన్నట్లు బుధవారం ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అధికారులు నిర్భయంగా తమ సీనియర్ అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తు సమన్వయంతో పనిచేసుకుపోవాలని మోదీ వివరించారు.

ఐఏఎస్ అధికారులు, అసిస్టెంట్ సెక్రటరీల శిక్షణ సదస్సులో మాట్లాడుతున్న
ప్రధాని నరేంద్ర మోదీ