జాతీయ వార్తలు

మోదీ అజ్ఞానం నుంచి బయటపడాలి: రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 19: దేశ స్వాతంత్య్రోద్యమ కాలంలో కాంగ్రెస్ పార్టీ చవిచూసిన అవమానాలు, ప్రతికూల పరిస్థితులకంటే ఈ ఆరున్నర దశాబ్దాల కాలంలో బిజెపి అనుభవించిన వ్యధలే ఎక్కువంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రధాని మోదీ తన అజ్ఞానం నుంచి బయటపడాలని మనసారా కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. ‘అసతోమా సద్గమయా.. తమ సోమా జ్యోతిర్గమయ.. మృత్యోన్మా అమృంతంగమయా.. ఓం శాంతి ఓం శాంతి ఓంశాంతి’ అని రాహుల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీని అర్థాన్ని కూడా ఆయన అందులో వివరించారు.