జాతీయ వార్తలు
ఎనిమిదేళ్ల బాలిక కిడ్నాప్, గ్యాంగ్రేప్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, ఆగస్టు 23: రాజధాని ఢిల్లీలో సభ్య సమాజం సిగ్గుపడే సంఘటన చోటుచేసుకుంది. ఇంటి ఆరుబయట నిద్రిస్తున్న ఎనిమిదేళ్ల బాలికను ముగ్గురు కాముకులు కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తూర్పు ఢిల్లీలోని మండావలీలో ఆదివారం రాత్రి ఈ దారుణ సంఘటన జరిగింది. అఘాయిత్యానికి పాల్పడిన ముగ్గురు దుర్మార్గులు బాలిక పొరుగున ఉండేవారేనని పోలీసులు వెల్లడించారు. బాలికపై సామూహిక అత్యాచారం చేసిన తరువాత ఆమెను ఇంటి సమీపంలో పడేశారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలిని ఎయిమ్స్కు తరలించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
అపస్మారక స్థితిలో ఉన్న బాలికకు ట్రామా సెంటర్లో చికిత్స అందిస్తున్నారు.