జాతీయ వార్తలు

ఎంపీల జీతాల పెంపుపై ప్రభుత్వం పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 30: పార్లమెంట్ సభ్యుల జీతాల్ని పెంచే అంశాన్ని ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తోంది. ఎంపీల జీతాలు, అలవెన్స్‌ల పెంపుపై ఏర్పాటయిన సంయుక్త పార్లమెంటరీ ప్యానల్ ముందు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన తుది ముసాయిదాపై కసరత్తు మొదలైందని, ఈ తతంగం పూర్తయిన తర్వాత ప్రధాన మంత్రి పరిశీలనకు జీతాలు పెంపు నివేదికను పంపుతామని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ సిబ్బందికి ఏడో వేతన కమిటి సిఫార్సులను అమలు చేసినప్పటికీ చట్ట సభ సభ్యులకు మాత్రం ఇంత వరకూ జీతాలు పెరుగలేదంటూ నేటి సమావేశంలో పాల్గొన్న కొందరు సభ్యులు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది.