జాతీయ వార్తలు

కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: డిడిసిఎ వ్యవహారానికి సంబంధించి తనపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మరో ఐదుగురు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై పరువు నష్టం దావావేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిర్ణయించుకున్నారు. వీరిపై ఢిల్లీ హైకోర్టులోనూ, పాటియాలా హౌజ్ కోర్టుల్లోనూ సోమవారం క్రిమినల్, పరువు నష్టం కేసులు దాఖలు చేయాలని తన న్యాయవాదుల బృందాన్ని కోరారు. వ్యక్తిగత హోదాలోనే వీరిపై కేసులు దాఖలు చేయాలని నిర్ణయించుకున్నానని, తన, తన కుటుంబ సభ్యుల పరువు తీసే విధంగా వీరందరూ ప్రకటనలు చేస్తున్నారని జైట్లీ అన్నారు.