జాతీయ వార్తలు

ఎవరిపైనా కక్ష లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: ఎవరిపైనా తనకు కక్ష లేదని, ఏ రాజకీయ పార్టీపై గానీ వ్యక్తిపై గానీ దర్యాప్తు జరపాల్సిందిగా తన ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం పేర్కొన్నారు. హర్యానాలో రాబర్ట్ వాద్రాకు సంబంధించిన భూముల లావాదేవీలపై దర్యాప్తు వివాదాస్పదమవడంతో మోదీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ‘గుజరాత్‌లో నేను 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశా. రాజకీయ కారణాలతో నేను ఎన్నడూ ఎవరి కేసుకు సంబంధించిన ఫైల్‌ను తెరిపించలేదనడానికి చరిత్రే సాక్ష్యం. నాపై అటువంటి ఆరోపణలేమీ లేవు. కేంద్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయింది. ఎవరి కేసుకు సంబంధించిన ఫైల్‌ను తెరవాలని మా ప్రభుత్వం ఎన్నడూ ఆదేశాలు జారీ చేయలేదు’ అని మోదీ ‘సిఎన్‌ఎన్-న్యూస్ 18’ వార్తా సంస్థతో అన్నారు.
సోనియా గాంధీ కుటుంబంపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోందన్న ఆరోపణ గురించి అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ మోదీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఏ కేసు విషయంలోనైనా చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన పేర్కొన్నారు. ‘ఎవరికీ వత్తాసు పలికే హక్కు నాకు లేదు. అంతేతప్ప మేము ఎవరినీ ఖాతరు చేయడం లేదని చెప్పడం సరికాదు’ అని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు సంబంధించిన వివాదాస్పద భూ లావాదేవీలపై హర్యానాలోని బిజెపి ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ దర్యాప్తు జరుపుతుండటంపై దుమారం రేగుతున్న నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.