జాతీయ వార్తలు

4నెలల పాపపై 17 కత్తిపోట్లు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, సెప్టెంబర్ 9: మగ బిడ్డ పుట్టక పోవడం ఆ తల్లిని రాక్షసిగా మార్చింది. వరుసగా రెండోసారీ ఆడపిల్లే పుట్టడంతో ఆ బాధను తట్టుకోలేక పోయింది. అంతే..నాలుగు నెలల పాపను అత్యంత హేయంగా, దారుణంగా హతమార్చింది. కూరలు తరుక్కునే చాకుతో ఆ పసిబిడ్డ గొంతు కేసేసింది! మొత్తం 17సార్లు పొడిచింది. ఆ పసిపాపను ఓ దుప్పటిలో చుట్టేసి మూలన పడి ఉన్న ఓ ఎయిర్‌కండిషన్‌ర్‌లో పెట్టేసింది. అసలు వ్యవహారం బయట పడటంతో 35 సంవత్సరాల నెహా గోయల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. నెహా గోయల్‌కు వరుసగా రెండోసారీ ఆడపిల్లే పుట్టింది. అప్పటికే ఆమెకు ఎనిమిదేళ్ల ఓ పాప ఉంది. గత నెల 26న నెహా గోయల్ ఒక్కసారిగా అరవడం మొదలు పెట్టింది. ఇంట్లో ఉన్నవాళ్లంతా పరుగెత్తుకుంటూ వచ్చారు. ఏమయిందని అడిగితే రెండోపాప కనిపించడం లేదంటూ గుండెలుబాదుకుంది. ఒక్కసారిగా అందరూ కంగారు పడ్డారు. వ్యవహారం పోలీసుల వరకూ వెళ్లింది. దర్యాప్తు మొదలైంది. ఇల్లంతా వెతికిన పోలీసులకు మూలనపడ్డ ఎయిర్‌కండిషనర్‌పై దృష్టి పడింది. అంతే..దుప్పట్లో చుట్టి ఉన్న పసికందు విగతజీవిగా బయట పడింది. ఆ పాప శరీరంపై 17 కత్తి పోట్లు ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారు. ఈ హత్య ఇంట్లోవాళ్లపనేనని అనుమానించిన పోలీసులు నెహా బెడ్‌రూమ్‌ను, బాత్‌రూమ్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంట్లో అందరి రక్తాన్నీ తీసుకుని పరీక్షలు జరిపారు. ఆ పసికందు శరీరంపై ఉన్న రక్తపు మరకలతో అసలు గుట్టు రట్టయింది. నెహానే ఆ ఘాతుకానికి పాల్పడట్టు రుజువైంది. ఇంటరాగేషన్‌లో తన నేరాన్ని నెహా గోయల్ అంగీకరించింది. మగపిల్లాడి కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేశానని, పూజలు కూడా చేయించానని చెప్పింది. సరోగసీ ద్వారా కూడా మగ పిల్లాడ్ని కనాలనీ తపించానని ఒప్పుకుంది. అవేవీ ఫలించలేదని, రెండోసారీ ఆడపిల్లే పుట్టడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులకు స్పష్టం చేసింది.