జాతీయ వార్తలు
అమరావతిపై కేసు 19కి వాయిదా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 17 September 2016
న్యూఢిల్లీ, సెప్టెంబరు 16: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణంపై విచారణను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సెప్టెంబరు 19కి వాయిదా వేసింది. ట్రిబ్యునల్ ఛైర్మన్ జస్టిస్ స్వతంత్రకుమార్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్లు శుక్రవారం విచారణకు వచ్చాయి. అయితే పిటిషనర్ల తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది సంజయ్ పారీఖ్ అందుబాటులో లేకపోవడంతో విచారణను ధర్మాసనం వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. అమరావతి నిర్మాణంలో పర్యావరణ అనుమతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ శ్రీమన్నారాయణ, బొలిశెట్టి సత్యనారాయణ, మాజీ ఐఎఎస్ అధికారి ఇఎఎస్ శర్మ విడివిడిగా గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.