జాతీయ వార్తలు

ఎన్‌కౌంటర్‌లో మిలీషియా కమాండర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుమ్ముగూడెం, సెప్టెంబర్ 30: ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర కిష్టారం పోలీసుస్టేషన్ పరిధిలోని వీరాపురం అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో సోడె గంగ(30) అనే మావోయిస్టు మిలీషియా కమాండర్ మృతి చెందాడు. ఛత్తీస్‌గఢ్ కోబ్రా దళాలు, సిఆర్‌పిఎఫ్ బలగాలు వీరాపురం అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా గంగతో పాటు పలువురు తారసపడ్డారు. ఎదురుకాల్పుల్లో సోడె గంగ మృతి చెందాడు. అతని వద్ద తుపాకీ, జిలిటెన్ స్టిక్స్, విప్లవసాహిత్యం లభ్యమైనట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు తెలిపారు.