జాతీయ వార్తలు

బాలుడి రక్తం తాగి, మాంసం తిన్నాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లూధియానా, జనవరి 21: పట్టుమని పదహారేళ్లు కూడా లేని ఓ కుర్రాడు తొమ్మిదేళ్ల బాలుడ్ని దారుణంగా నరికి చంపి రక్తం తాగి, పచ్చి మాంసాన్ని తినేశాడట. పంజాబ్‌లోని డుగ్రీలో ఈ దారుణ సంఘటన జరిగింది. దీప్ కుమార్ అనే బాలుడు గత సోమవారం కనిపించకుండా పోయాడు. మరుసటి రోజు ఖాళీ ప్రదేశంలో ఆ బాలుడి మృత దేహాన్ని పోలీసులు కనుగొన్నారు. పొరుగింట్లో ఉండే 16 ఏళ్ల వికేష్ కుమార్ అనే బాలుడు దీపుతో పాటుగా ఉండడాన్ని సిసి ఫుటేజ్ సాయంతో పోలీసులు గుర్తించి అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తానే ఆ బాలుడ్ని చంపేసినట్లు వికేష్ అంగీకరించాడు. మాంసం తినాలని అనిపించడంతో అలా చేశానని అతను చెప్పడంతో పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో గాలి పటం, దారం ఇస్తానని చెప్పి దీపును తన ఇంటికి తీసుకు వచ్చానని వికేష్ చెప్పాడు. ఆ తర్వాత ఆ బాలుడ్ని బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లి పదునైన ఆయుధంతో పొడిచి చంపాడు. అనంతరం శరీరాన్ని ముక్కలుగా నరికాడు. ఓ పాలిథిన్ కవర్‌లో అవయవాలను పెట్టుకుని తన ఇంటికి 50 మీటర్ల దూరంలో ఉన్న ఖాళీగా ఉండే ప్రదేశంలో దాన్ని పడేశాడు. గుండెను మాత్రం తాను చదివే పాఠశాల ఆవరణలో పడేసినట్లు చెప్పాడు. బడికి వెళ్లడం ఇష్టం లేదని, టీచర్లంటే కోపమని, అలా చేసినట్లయితే స్కూలుకు చెడ్డపేరు వస్తుందని, దాన్ని మూసేస్తారనే ఉద్దేశంతోనే అలా చేశానని వికేష్ పోలీసులకు చెప్పాడు. తన చేతి వేళ్లనే తినేయాలని అనిపిస్తూ ఉంటుందని వికేష్ చెప్పడంతో పోలీసులు అతడ్ని మానసిక చికిత్సాలయంలో చేర్పించారు.

పోలీసుల అదుపులో నిందితుడు వికేష్ కుమార్