జాతీయ వార్తలు

అమరావతికి హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 22: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భవనాన్ని ఏర్పాటు చేసి వౌలిక సదుపాయాలు కల్పిస్తే రాష్ట్ర హైకోర్టును తక్షణం ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. బుధవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో తెలుగుదేశం పక్షం నాయకుడు తోట నరసింహం అడిగిన అనుబంధ ప్రశ్నకు బదులిస్తూ రాష్ట్రం విడిపోయిన అనంతరం రెండు రాష్ట్రాలకు రెండు హైకోర్టులు ఏర్పాటు చేయటం న్యాయమన్నారు. తెలంగాణ కూడా కొత్త రాష్టమ్రే. వారికీ హైకోర్టు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. రవిశంకర్ ప్రసాద్ ఈ ప్రకటన చేయగానే సభలోని తెరాస ఎంపీలు బల్లలు చరుస్తూ ఆమోదం తెలిపారు. అంతకుముందు లోక్‌సభలో తెదేపా ఎంపీ తోట నరసింహం ఆంధ్రలో ప్రత్యేక హైకోర్టును వీలున్నంత త్వరగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.