జాతీయ వార్తలు

ఏం చేద్దాం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అద్వానీతో జోషి భేటీ
సీనియర్ మంత్రులతో మోదీ సమావేశం
సుప్రీం తీర్పు
పర్యవసానాలపై చర్చ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: బాబరీ మసీదు విధ్వంసం కేసులో తమపై కుట్ర పూరిత అభియోగాలను సుప్రీం కోర్టు పునరుద్ధరించిన నేపథ్యంలో బిజెపి సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి బుధవారం మరో నేత ఎల్‌కె అద్వానీని కలుసుకున్నారు. తీర్పు పర్యవసానాలపైనే వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. భారత రాష్టప్రతి, ఉపరాష్టప్రతి పదవులకు వీరి తమ పేర్లు వినిపిస్తున్న తరుణంలో సుప్రీం తీర్పు వెలువడటం అద్వానీ, జోషిలకు ఆశనిపాతంగా భావిస్తున్నారు. దాదాపు 40నిముషాల పాటు ఈ సమావేశంలో రాజకీయ, న్యాయపరమైన అంశాలూ చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. మరోపక్క ప్రధాని నరేంద్ర మోదీ కూడా పార్టీ అధినేత అమిత్ షా కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, గడ్కరీ, వెంకయ్య నాయుడుతో తన ఇంట్లో సమావేశమయ్యారు.