జాతీయ వార్తలు

కొత్త గవర్నర్ వస్తారా?కొత్త గవర్నర్ వస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పదవీ కాలాన్ని మరోసారి పొడిగిస్తారా లేక ఆయన స్థానంలో కొత్తవారిని నియమిస్తారా? అనే విషయమై రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. నరసింహన్ పదవీ కాలం మే మూడో తేదీతో ముగుస్తోంది. ఆంధ్ర, తెలంగాణతోపాటు తమిళనాడు, జమ్ముకాశ్మీర్, మధ్యప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాలకు కూడా కొత్త గవర్నర్లను నియమించవలసి ఉన్నది. ప్రస్తుతం గవర్నర్ల నియామకానికి సంబంధించిన ఫైలు ప్రధాన మంత్రి పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. రెండు రాష్ట్రాలకూ ఒకరే గవర్నరుగా ఉండటం సమంజసం కాదని కేంద్ర ప్రభుత్వం కూడా భావిస్తోందని హోం శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఏపి విభజన చట్టాన్ని సక్రమంగా అమలు చేసేందుకు గతంలో నరసింహన్‌ను రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా కొనసాగించారు. విభజన చట్టం అమలులో ఎదురైన మెజారిటీ సమస్యలు పరిష్కారమైనందున ఇక మీదట రెండు రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నరుగా కొనసాగించవలసిన అవసరం లేదని కేంద్రం భావిస్తోందని అంటున్నారు. కాగా ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమకు కొత్త గవర్నర్లను నియమించాలని కోరుతున్నట్లు తెలిసింది. తెలుగు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించే అంశంపై హోం శాఖ తయారు చేసిన నోట్ ప్రధాన మంత్రి పరిశీలనలో ఉన్నదని అంటున్నారు. నరసింహన్‌ను తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా కొనసాగించి రెండో రాష్ట్రానికి బిజెపి సీనియర్ నేతను గవర్నర్‌గా నియమించాలని బిజెపి నాయకులు వాదిస్తున్నట్లు తెలిసింది. 2019లో జరిగే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏపి, తెలంగాణలకు గవర్నర్లను ఎంపిక చేయాలని బిజెపి సూచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని మోదీ ఈ నెలాఖరులో కొత్త గవర్నర్ల నియామకంపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని హోం శాఖ వర్గాలు చెబుతున్నాయి.